Rajasthan: కూతురి కోసం రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు.. తర్వాతి రోజు బస్టాప్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి షాక్.. ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-08-15T20:25:04+05:30 IST
ఆ బాలిక గత శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. సాయంత్రమైనా తిరిగి రాలేదు..
ఆ బాలిక గత శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. సాయంత్రమైనా తిరిగి రాలేదు.. కంగారు పడిన తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.. స్నేహితుల, బంధువుల ఇళ్లకు వెళ్లి అడిగారు.. రాత్రంతా ఆ బాలిక గురించి వెతుకుతూనే ఉన్నారు.. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు.. తర్వాతి రోజు ఉదయం పది గంటలకు స్థానిక బస్టాప్లో ఆ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది.. రోజున్నర తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక చెప్పిన విషయం విని షాకైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి..
Viral News: భర్తకు తగిన గుణపాఠం చెప్పిన భార్య.. భర్త నిర్వాకం గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి..
రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్కు చెందిన 17 ఏళ్ల బాలికకు తన స్నేహితురాలి బాయ్ఫ్రెండ్ ఆకాష్ నాయక్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. గత శుక్రవారం ఆ బాలికకు ఆకాష్ ఫోన్ చేసి టిఫిన్ చేయడానికి హోటల్కు రమ్మని అడిగాడు. దీంతో ఆ బాలిక అక్కడకు వెళ్లింది. టిఫిన్లో మత్తు పదార్థాలు కలపడంతో ఆ బాలిక అస్వస్థతకు గురైంది. ఆ బాలికను హోటల్ రూమ్కు తీసుకెళ్లిన ఆకాష్ అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయంత్రం స్పృహలోకి వచ్చిన బాలికను మళ్లీ రెస్టారెంట్కు తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన కూల్డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన బాలిక మళ్లీ స్పృహ కోల్పోయింది.
ఆ బాలికను మళ్లీ హోటల్ రూమ్కు తీసుకెళ్లి రాత్రంతా ఆకాష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు ఉదయం ఆ బాలికను తీసుకెళ్లి ఆమె ఇంటికి దగ్గర్లో ఉన్న బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.