బ్యూటీ పార్లర్లో పనిచేసే 18 ఏళ్ల యువతి.. రోజూ ఇంటి నుంచి వచ్చేదారిలో పరిచయమైన యువకుడు.. ఇద్దరి మధ్య ప్రేమ.. ఆ తరువాత ఒకరోజు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-02-07T05:46:07+05:30 IST
ఆమె ఒక బ్యూటీ పార్లర్లో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు తన ఇంటి నుంచి పార్లర్కు వెళ్లే దారిలో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతనొక ఆటో డ్రైవర్. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. రోజూ ఆమె అతని ఆటోలో ఇంటి నుంచి వెళ్లేది. అలా ఇద్దరూ ప్రతిరోజూ కలిసి సమయం గడపడిపేవారు...
ఆమె ఒక బ్యూటీ పార్లర్లో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు తన ఇంటి నుంచి పార్లర్కు వెళ్లే దారిలో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతనొక ఆటో డ్రైవర్. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. రోజూ ఆమె అతని ఆటోలో ఇంటి నుంచి వెళ్లేది. అలా ఇద్దరూ ప్రతిరోజూ కలిసి సమయం గడపడిపేవారు. స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ నగరంలో నివసించే సరళ(18, పేరు మార్చబడినది) అనే యువతి ఒక బ్యూటీ పార్లర్లో ఉద్యోగం చేస్తోంది. ఒకరోజు రాత్రి ఇంటికి బయలుదేరిన సమయంలో ఆమె తన పర్సు పోగొట్టుకుంది. రోడ్డుపై ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ రాజా ఖాన్ పరిచయమయ్యాడు. ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చాడు. ఆ తరువాత సరళ అతని ఆటోలో రోజూ బ్యూటీ పార్లర్కు వెళ్లేది.
అలా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. రాజా ఖాన్ తరుచూ సరళ ఇంటికి కూడా వచ్చేవాడు. ఒకరోజు సరళ ఇంట్లో ఒంటరిగా ఉన్నవేళ రాజాఖాన్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి.. ఇక పెళ్లి చేసుకునేది లేదని ఆమెను మోసం చేశాడు. దీంతో సరళ పోలీసులకు రాజాఖాన్పై ఫిర్యాదు చేసింది.
అత్యాచారం కేసులో.. పోలీసులు రాజ ఖాన్ను విచారణ చేస్తున్నారు.