KGF 2 సినిమా థియేటర్లోంచి పరుగులు తీసిన ప్రేక్షకులు.. ఒక్కడు చేసిన పనివల్ల..
ABN , First Publish Date - 2022-04-21T18:56:35+05:30 IST
అంతా కేజీఎఫ్ 2 సినిమా చూస్తుండగా.. ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటు చేసుకుంది. థియేటర్లో నుంచి అంతా ఒక్కసారిగా పరుగులు తీయడం మొదలెట్టారు. ఏం జరుగుతుందో చాలా మందికి ...
అంతా కేజీఎఫ్ 2 సినిమా చూస్తుండగా.. ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటు చేసుకుంది. థియేటర్లో నుంచి అంతా ఒక్కసారిగా పరుగులు తీయడం మొదలెట్టారు. ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కాలేదు. ఒకరిని చూసి ఇంకొకరు బయటికి వెళ్లిపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఒకే ఒక్కడు చేసిన పని.. కర్నాటక వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం హవేరీలోని రాజశ్రీ సినిమా థియేటర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మొగలి గ్రామానికి చెందిన వసంత్ కుమార్ అనే యువకుడు.. తన స్నేహితులతో కలిసి కేజీఎఫ్ 2 సినిమా చూసేందుకు వచ్చాడు. థియేటర్లో మరో యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది. వసంత్ కుమార్ కుర్చీ మీద వెనుక నుంచి కాళ్లు పెట్టడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. గొడవ పెద్దది అవడంతో యువకుడు బయటికి వెళ్లి, తుపాకీతో లోపలికి వచ్చి వసంత్ కుమార్పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వాడే గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ శవం.. ఎవరిదా అని ఆరా తీస్తే..
దీంతో థియేటర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక అంతా బయటికి పరుగులు తీశారు. కాల్పులు జరిపిన అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. థియేటర్లో అసలు ఏం జరిగింది, యువకుడు కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి.. ఇంతకీ ఆ యువకుడు ఎవరు.. తదితర కోణాల్లో విచారిస్తున్నారు. ఇదిలావుండగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.