JCB machine: జేసీబీలో ఆసుపత్రికి క్షతగాత్రుడి తరలింపు...వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-09-14T15:02:03+05:30 IST
రోడ్డు ప్రమాదంలో(Accident) తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని(Accident victim) జేసీబీలో(JCB machine) ఆసుపత్రికి తరలించిన ఘటన...
భోపాల్(మధ్యప్రదేశ్): రోడ్డు ప్రమాదంలో(Accident) తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని(Accident victim) జేసీబీలో(JCB machine) ఆసుపత్రికి తరలించిన ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోని కత్నీ జిల్లాలో వెలుగుచూసింది. కత్నీ జిల్లా ఖిటౌలీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్సుకు(ambulance) ఫోన్ చేసినా, సర్వీసు మార్పు వల్ల అది సకాలంలో రాలేదు. దీంతో జనపద్ పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ వెంటనే స్పందించి తన జేసీబీలోనే(JCB) క్షతగాత్రుడిని ఆసుపత్రికి(hospital) తరలించారు.
క్షతగాత్రుడిని జేసీబీలో ఆసుపత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. గత నెలలో నీమచ్ జిల్లాలో వచ్చిన వరదలతో అంబులెన్స్ రాకపోవడంతో ఓ గర్భవతిని జేసీబీలోనే ఆసుపత్రికి తరలించారు.