అమెరికాలో ఘోరం.. ఈతకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు మృతి

ABN , First Publish Date - 2022-11-28T09:38:51+05:30 IST

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన తాజాగా చోటు చేసుకుంది. హన్మకొండకు చెందిన ఉత్తేజ్, నిజామాబాద్‌కు చెందిన..

అమెరికాలో ఘోరం.. ఈతకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు మృతి

ఎన్నారై డెస్క్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన తాజాగా చోటు చేసుకుంది. హన్మకొండకు చెందిన ఉత్తేజ్, నిజామాబాద్‌కు చెందిన శివ ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఈ ఇద్దరు యువకులు.. కాలక్షేపం కోసం లాండర్ వ్యాలీ లేక్ వద్దకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు లేక్‌లోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులూ గల్లంతయ్యారు. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. ఉత్తేజ్, శివ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-11-28T09:38:57+05:30 IST