ఎన్నారై టీడీపీ కువైత్ కార్యవర్గం-2 ఆధ్వర్యములో ‘ఇదేమి కర్మ’ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-12-09T19:01:07+05:30 IST

ఎన్నారై టీడీపీ కువైత్ కార్యవర్గం-2 అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ‘ఇదేమి కర్మ’ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగం సూచనలతో జరిగిన ఈ కార్యక్రమానికి..

ఎన్నారై టీడీపీ కువైత్ కార్యవర్గం-2 ఆధ్వర్యములో ‘ఇదేమి కర్మ’ కార్యక్రమం

ఎన్నారై డెస్క్: ఎన్నారై టీడీపీ కువైత్ కార్యవర్గం-2 అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ‘ఇదేమి కర్మ’ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగం సూచనలతో జరిగిన ఈ కార్యక్రమానికి కువైత్‌లోని పలు ప్రదేశాల నుంచి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో అహ్మది గవర్నరేట్ కో-ఆర్డినేటర్ ఈదుపుగంటి దుర్గా ప్రసాద్, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ కో-ఆర్డినేటర్ పెంచల్ రెడ్డి, మైనార్టీ కన్వీనర్ చాన్ బాషా, ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T19:01:09+05:30 IST