Wind power: పెరిగిన పవన విద్యుత్
ABN , First Publish Date - 2022-11-01T08:55:28+05:30 IST
రాష్ట్రంలో పవన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి సామరథ్యం 4,100 మెగవాట్లకు పెరగనుంది. పవన విద్యుత్ పథకంపై కేంద్రప్రభుత్వం(Central Govt) కొత్త
- 4,100 మెగావాట్ల ఉత్పత్తికి అనుకూలం
ప్యారీస్(చెన్నై), అక్టోబరు 31: రాష్ట్రంలో పవన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి సామరథ్యం 4,100 మెగవాట్లకు పెరగనుంది. పవన విద్యుత్ పథకంపై కేంద్రప్రభుత్వం(Central Govt) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో పవన విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యాన్ని 4,100 మెగవాట్లకు పెంచేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు రాష్ట్రంలోని పవన విద్యుత్ కేంద్రాల్లో వసతులను మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం 4,100 మెగవాట్లకు పెంచనున్నారు. విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరగాలంటే పవన విద్యుత్(Wind power) కేంద్రాల్లో వున్న పాత టర్బన్లను మార్చాల్సివుంది. అయితే చాలా వరకు విద్యుత్ కేంద్రాల్లో పాత టర్బన్లే వున్నాయి. దీంతో ఈ టర్బన్లను మార్చి, ఉత్పత్తిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిజానికి పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచాలని 2016లోనే కేంద్రప్రభుత్వం సూచించింది. కానీ ఇప్పటికి పనులు ఊపందుకున్నట్లు అధికారులు తెలిపారు.