Ranchi violenceకు WhatsApp groupలే ఆజ్యం పోశాయట
ABN , First Publish Date - 2022-06-13T21:25:11+05:30 IST
మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై బీజేపీ(BJP)నే నుపుర్ శర్మ(Nupur Sharma) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లో చెలరేగిన అల్లర్లలో నిరసనకారులను ఏకం చేసింది వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లేనని పోలీసులు తెలిపారు..
రాంచీ: మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై బీజేపీ(BJP)నే నుపుర్ శర్మ(Nupur Sharma) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లో చెలరేగిన అల్లర్లలో నిరసనకారులను ఏకం చేసింది వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లేనని పోలీసులు తెలిపారు. వస్సేపూర్ గ్యాంగ్(Wasseypur Gang) అనే పేరుతో రూపొందించిన వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చిన నిరసన కారులు అల్లర్లను తీవ్రం చేశారని, మిగిలిన వారికి మరింతగా రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల అడ్మిన్ల కోసం విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం మూడు రోజుల తర్వాత రాంచీలో ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. అది కాస్త అల్లర్లకు దారి తీసింది. ఈ అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ అల్లర్లు చెలరేగాయి.