Vijaykanth: విరాళాలు తీసుకోని పార్టీ మాది

ABN , First Publish Date - 2022-09-14T16:09:57+05:30 IST

ఎవరి దగ్గర విరాళాలు తీసుకోని పార్టీగా డీఎండీకే నిలిచిందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌(Vijaykanth) తెలిపారు. పార్టీ బుధవారం 18వ

Vijaykanth: విరాళాలు తీసుకోని పార్టీ మాది

                                  - నేడు 18వ వసంతంలోకి డీఎండీకే

 

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 13: ఎవరి దగ్గర విరాళాలు తీసుకోని పార్టీగా డీఎండీకే నిలిచిందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌(Vijaykanth) తెలిపారు. పార్టీ  బుధవారం 18వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆయన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే పార్టీ స్థాపించానని, పార్టీకి జీవం పోసింది కార్యకర్తలేనన్నారు. ఎవరి దగ్గర విరాళాలు తీసుకోకుండా ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తున్న పార్టీగా నిలిచిందన్నారు. పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే ప్రతిపక్ష స్థాయికి ఎదిగామని, ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓటమి చెందినంత మాత్రాన పార్టీ పనైపోయిందని భావించరాదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి పూర్వవైభవం సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని విజయకాంత్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-09-14T16:09:57+05:30 IST