ముగిసిన ఉప రాష్ట్రపతి పర్యటన
ABN , First Publish Date - 2022-05-30T14:48:44+05:30 IST
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి రాష్ట్ర పర్యటన ఆదివారంతో ముగిసింది. ఐదు రోజుల పర్యటన కోసం గత బుధవారం చెన్నై వచ్చిన
చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి రాష్ట్ర పర్యటన ఆదివారంతో ముగిసింది. ఐదు రోజుల పర్యటన కోసం గత బుధవారం చెన్నై వచ్చిన వెంకయ్య.. శనివారం చెన్నైలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం వెంకయ్య దంపతులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారికి విమానాశ్రయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర మంత్రులు దురైమురుగన్, కె.పొన్ముడి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఇన్బు, డీజీపీ శైలేంద్రబాబు, లోక్సభ సభ్యుడు టీఆర్ బాలు తదితరులు సాదరంగా వీడ్కోలు పలికారు.