మరోసారి యోగీకి పట్టంకట్టిన యూపీ ప్రజలు
ABN , First Publish Date - 2022-03-10T17:13:37+05:30 IST
ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి యోగీకి పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో...
ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి యోగీకి పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. యూపీ, ఉత్తరాఖండ్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్లో హస్తాన్ని చీపురు (ఆప్) ఊడ్చేసింది.
ఉత్తర ప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 263కి స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగీ సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.