Triple talaq : ప్రధాని మోదీకి మద్దతిచ్చిందని భార్యకు తలాక్..
ABN , First Publish Date - 2022-07-30T03:05:58+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), యూసీ(UP) సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanth)కు మద్దతు తెలిపిందని కట్టుకున్న భార్యకే త్రిపుల్ తలాక్ చెప్పాడో ప్రభుద్ధుడు.
మొరదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), యూసీ(UP) సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)కు మద్దతు తెలిపిందని కట్టుకున్న భార్యకే త్రిపుల్ తలాక్ చెప్పాడో ప్రభుద్ధుడు. ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని మొరదాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పీఎం మోడీ, సీఎం ఆదిత్యనాథ్కి ఓటు వేయడంతో భర్త, అత్తింటివాళ్లు వేదింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మార్చి 3న ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని పోలీసులు తెలిపారు. మొరదాబాద్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో నమోదయిందని, దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. బాధితురాలి పేరు షనా ఇరం. కాగా ఈమెను డిసెంబర్ 2019లో మొహమ్మద్ నదీమ్ పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.
తాను మోదీకి మద్దతిస్తున్న విషయాన్ని పెళ్లైన తర్వాత తెలుసుకుని ఈ హింసకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. త్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తనకు చెప్పాడని ఫిర్యాదులో వెల్లడించింది. భర్త తోబుట్టవులు కొన్ని రోజులుగా తనను హింసిస్తున్నారని పేర్కొంది. దీంతో ఐపీసీ 376, 511 సెక్షన్ల కింది నిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిలేష్ భదోరియా వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు.