ప్రాంతీయ భాషలకు జాతీయ గుర్తింపు: Union Minister Dharmendra Pradhan
ABN , First Publish Date - 2022-09-19T17:34:57+05:30 IST
కేంద్రప్రభుత్వం అమలుచేయనున్న నూతన విద్యా విధానంలో తమిళం సహా ప్రాంతీయ భాషలను జాతీయ భాషలుగా అంగీకరించనున్నట్లు
చెన్నై/పెరంబూర్: కేంద్రప్రభుత్వం అమలుచేయనున్న నూతన విద్యా విధానంలో తమిళం సహా ప్రాంతీయ భాషలను జాతీయ భాషలుగా అంగీకరించనున్నట్లు కేంద్ర విద్య, ప్రతిభాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్(Union Minister Dharmendra Pradhan) తెలిపారు. తంజావూరులో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ప్రపంచంలోనే భారత్ అభివృద్ధి పథంలో ఉందన్నారు. 2023వ సంవత్సరంలోపు కోటిన్నర గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ సేవలు ప్రారంభించనున్నామని వెల్లడించారు. కరోనా కాలంలో మన సాంప్రదాయ వైద్యవిధానం ఎంతో ఉపకరించిందన్నారు. విద్యార్థులు మాతృభాషలోనే చదివితే కఠినమైన పాఠ్యాంశాలు కూడా సులువుగా నేర్చుకోవచ్చని, డిగ్రీలు పొందిన ప్రతి విద్యార్థి మరో ఐదుగురికి ఉపాధి చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.