Yatra: తిరుపతి టూ న్యూఢిల్లీ ఆటోయాత్ర
ABN , First Publish Date - 2022-09-04T14:37:26+05:30 IST
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్ ఢిల్లీ వరకు చేపట్టిన యాత్ర శనివారం
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 3: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్ ఢిల్లీ వరకు చేపట్టిన యాత్ర శనివారం చెన్నై చేరుకుంది. తిరుపతి రైల్వేస్టేషన్(Tirupati Railway Station) వద్ద ఉన్న సుదర్శన్ ఆటో స్టాండ్కు చెందిన ఐఎస్ ఖాజా తిరుపతి నుంచి న్యూఢిల్లీకి చేపట్టిన ఆటో యాత్ర నగరానికొచ్చింది. స్థానిక ట్రిప్లికేన్ నియోజకవర్గంలోని చెన్నై ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఐఎస్ ఖాజా(IS Khaza) బృందానికి పాత్రికేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐఎస్ ఖాజా ఆటో యాత్ర గురించి వివరిస్తూ... భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సమరయోధులు, మహనీయుల ఫొటోలతో ఆటో రూపొందించి 75 రోజుల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, మహిళా ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.