forest areaలో కూలీని చంపిన పులి
ABN , First Publish Date - 2022-06-13T14:17:17+05:30 IST
కలప కోసం అడవికి వెళ్లిన ఓ కూలీపై పులి దాడి చేసి చంపిన ఘటన...
చంద్రపూర్(మహారాష్ట్ర): కలప కోసం అడవికి వెళ్లిన ఓ కూలీపై పులి దాడి చేసి చంపిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వెలుగుచూసింది.చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి తహసీల్లో ఆదివారం మధ్యాహ్నం రాజేంద్ర అర్జున్ కమ్డిగా 50 ఏళ్ల వ్యక్తి తన తల్లి, భార్యతో కలిసి కలపను సేకరించడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో పులి దాడి చేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.రాజేంద్ర అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ కంచె నిర్మించడానికి కలప తీసుకువచ్చేందుకు తల్లి, భార్యతో కలిసి అడవికి వెళ్లారు.రాజేంద్ర కలప కోసం చెట్టు కొడుతుండగా పొదల్లో దాక్కున్న పులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి చంపింది. సమీపంలోనే ఉన్న రాజేంద్ర తల్లి, భార్య అరవడంతో పులి పారిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక గ్రామస్థులు, అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి తరలివచ్చారు.ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.