26న తాంబరం -చెంగల్పట్టు 3వ రైలు మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ
ABN , First Publish Date - 2022-05-24T16:34:26+05:30 IST
తాంబరం -చెంగల్పట్టు మూడవ రైలుమార్గం, మదురై -తేని బ్రాడ్గేజ్ రైలుమార్గాలను ఈ నెల 26వ తేదీ చెన్నైలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఐసిఎఫ్(చెన్నై): తాంబరం -చెంగల్పట్టు మూడవ రైలుమార్గం, మదురై -తేని బ్రాడ్గేజ్ రైలుమార్గాలను ఈ నెల 26వ తేదీ చెన్నైలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే మదురై -తేని వరకు బ్రాడ్ గేజ్ పనులు ముగిశాయి. స్థానిక నెహ్రూ స్టేడియంలో 26వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రెండు మార్గాలను ప్రారంభించనున్నారు.