Shashikala: శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరూ రావద్దు
ABN , First Publish Date - 2022-08-17T13:11:43+05:30 IST
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దంటూ అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు
చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దంటూ అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ(Shashikala) విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న ఆమె తన జన్మదిన వేడుకలను టి.నగర్ నివాసంలో నిరాడంబరంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె చేసిన ప్రకటనలో తన జన్మదిన వేడుకల(Birthday celebrations) సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు, కానుకలు సమర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు టి.నగర్ నివాసానికి రావద్దన్నారు. తనకు కానుకలివ్వడానికి బదులుగా ఆ సొమ్ముతో నిరుపేదలకు ఆయా ప్రాంతాల్లో నాయకులు కార్యకర్తలు సహాయాలను పంపిణీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.