ఏడు పురాతన విగ్రహాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-18T15:17:25+05:30 IST

విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం

ఏడు పురాతన విగ్రహాలు స్వాధీనం

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 17: విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికారులు శనివారం ఉదయం ఆ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణం వెనుకవైపున్న తోటలో దాచిన అర్ధనారీశ్వరుడు, శివగామిఅమ్మాళ్‌, కృష్ణుడు, బుద్ధుడు, నెమలి వాహనం విగ్రహం సహా 7 ప్రాచీన విక్రయాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని కుంభకోణం కోర్టులో అప్పగించి, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

Updated Date - 2022-09-18T15:17:25+05:30 IST