Sabarimala : శబరిమల కిటకిట

ABN , First Publish Date - 2022-12-12T05:19:47+05:30 IST

శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఏకంగా లక్షమంది దాకా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. రద్దీకి తోడు వర్షం కురవడంతో.. భక్తులు ఎటూ

Sabarimala : శబరిమల కిటకిట

శనివారం ఒక్కరోజే లక్ష మంది దర్శనం

తిరువనంతపురం, డిసెంబరు 11: శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఏకంగా లక్షమంది దాకా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. రద్దీకి తోడు వర్షం కురవడంతో.. భక్తులు ఎటూ కదిలే దారి లేక పంపానది నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లలో ఎక్కడివారు అక్కడే తడిసి ముద్దయ్యారు. రద్దీ నియంత్రణలో పోలీసులకు గాయాలయ్యాయి. ఆది, సోమవారాల్లో కూడా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌లో 1.10 లక్షల మంది దాకా బుక్‌ చేసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేరళ హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. ‘‘ఇంతలా రద్దీ పెరిగితే నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరో గంట పాటు దర్శన వేళలను పొడిగించలేరా?’’ అంటూ పోలీసులను ప్రశ్నించింది. దీనికి దేవాదాయ శాఖ అధికారుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ అంశం దేవస్థానం ప్రధాన తంత్రి(అర్చకుడు) పరిధిలోనిదని చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. మరోవైపు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్శన వేళలను మరో గంట పాటు పెంచాలని దేవస్వంబోర్డు, ప్రధాన తంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.

Updated Date - 2022-12-12T05:19:48+05:30 IST