Trains: ట్రాక్‌ మారే వ్యవస్థలో అంతరాయం

ABN , First Publish Date - 2022-09-18T18:05:52+05:30 IST

రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో ట్రాక్‌ మారే ప్రాంతంలో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా ఎక్కడి రెళ్లు అక్కడే నిలిచిపోవడంతో

Trains: ట్రాక్‌ మారే వ్యవస్థలో అంతరాయం

                                   - ఎక్కడికక్కడే నిలిచిన రైళ్లు


వేలూరు(చెన్నై), సెప్టెంబరు 17: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో ట్రాక్‌ మారే ప్రాంతంలో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా ఎక్కడి రెళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తిరువాలంగోడు రైల్వేస్టేషన్‌(Thiruvalangodu Railway Station) మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నాలుగో మార్గం నుంచి మార్చి రెండో మార్గంలో పంపుతుంటారు. శనివారం ఉదయం పట్టాలు మారే ప్రాంతంలో సాంకేతికలోపం తలెత్తడంతో చెన్నై-కోవై శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా చెన్నై-అరక్కోణం-చెన్నై సబర్బన్‌ రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతులు చేపట్టడంతో రెండు గంటల ఆలస్యంగా రైళ్లు బయల్దేరి వెళ్లాయి. సాంకేతికలోపం కారణంగా ఈ అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-18T18:05:52+05:30 IST