ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-25T03:08:55+05:30 IST

ఇప్పటి వరకు 70 సైనిక స్థావరాలు, 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా 1,50,000 నుంచి 2,00,000 సైన్యాన్ని మోహరించినట్లు రష్యా తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేంత..

ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక

మాస్కో: ప్రపంచ దేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ వ్యవహారంలో ఎవరైనా తలదూరిస్తే ఎంతకైనా తెగిస్తామని ఆయన తెగేసి చెప్పారు. ఎవరు జోక్యం చేసుకున్నా విపరీత పరిణామాలు ఉంటాయని ఆయన మరోమారు హెచ్చరించారు. రష్యా దండయాత్రపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొకవైపు అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొడతామని యూరోపియన్ యూనియన్ గురువారం సాయంత్రం ప్రకటించింది. యుద్ధానికి కంటే ముందే అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. వాటికి అనుగుణంగా గురువారం మరిన్న ఆంక్షలు విధించాయి.


గురువారం వేకువజామునే ప్రారంభమైన దండయాత్ర.. ఇప్పటి వరకు 70 సైనిక స్థావరాలు, 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా 1,50,000 నుంచి 2,00,000 సైన్యాన్ని మోహరించినట్లు రష్యా తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేంత వరకు ఈ యుద్ధం కొనసాగించాలని రష్యా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-02-25T03:08:55+05:30 IST