మాన్ చేతిలోనే హోం, ఇతరులకు శాఖల కేటాయింపు
ABN , First Publish Date - 2022-03-22T02:23:31+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారంనాడు..
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను మాన్ తన వద్దే ఉంచుకున్నారు. మార్చి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మాన్, ఈనెల 19న 10 మందిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. తాజాగా వారికి శాఖలు కేటాయించారు.
హర్పాల్ సింగ్ చీమాకు ఆర్థిక శాఖ, హర్బజన్ సింగ్కు విద్యుత్ శాఖ, విజయ్ సింగ్లాకు ఆరోగ్య శాఖ కేటాయించారు. లాల్చంద్కు ఫుడ్ అండ్ సప్లయ్, గుర్మీత్ సింగ్ మీట్ హయెర్కు విద్యాశాఖ, కుల్దీప్ సింగ్ ధలివాల్కు గ్రామీణివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ, లలిత్ సింగ్ భుల్లర్కు రవాణా శాఖ, బ్రమ్ శంకర్ జింపాకు వాటర్ అండ్ డిజాస్టర్ శాఖ, హర్జోత్ సిగ్ బైన్స్కు న్యాయ, పర్యాటక శాఖ, బల్జీత్ కౌర్కు సామాజిక భద్రత, మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించారు. భగవంత్ మాన్ 18 మంది వరకూ సభ్యులను తన మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు.