British Queen : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , First Publish Date - 2022-09-14T20:57:50+05:30 IST
బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలకు
న్యూఢిల్లీ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హాజరవుతారు. ఈ నెల 17న ఆమె లండన్ బయల్దేరుతారు, ఈ నెల 19న క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. భారత ప్రభుత్వం తరపున ద్రౌపది సంతాపం తెలుపుతారు. ఈ వివరాలను విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
యునైటెడ్ కింగ్డమ్, కామన్వెల్త్ నేషన్స్ అధిపతి ఎలిజబెత్-2 ఈ నెల 8న మరణించారు. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ నెల 12న బ్రిటిష్ హై కమిషన్ను సందర్శించి, భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు. భారత దేశం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగా పాటించింది.
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్మినిస్టర్ అబ్బేలో ఈ నెల 19న జరుగుతాయి. దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. దీంతో బ్రిటన్లోని కొన్ని మీడియా సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తున్న దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.