భారత్‌లో పేదరికం తగ్గింది..

ABN , First Publish Date - 2022-04-18T08:36:28+05:30 IST

భారత్‌లో పేదరికం బాగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2011-2019 మధ్యకాలంలో దేశంలో తీవ్రమైన పేదరికం 12.3ు తగ్గినట్టుగా ప్రపంచబ్యాంకు పాలసీ రీసెర్చ్‌ వర్కింగ్‌ పేపర్‌ తెలిపింది.

భారత్‌లో పేదరికం తగ్గింది..

2011-19లో 12.3ు తగ్గిందన్న ప్రపంచ బ్యాంకు

పట్టణాల కన్నా గ్రామాల్లో బాగా తగ్గిన పేదరికం 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: భారత్‌లో పేదరికం బాగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2011-2019 మధ్యకాలంలో దేశంలో తీవ్రమైన పేదరికం 12.3ు తగ్గినట్టుగా ప్రపంచబ్యాంకు పాలసీ రీసెర్చ్‌ వర్కింగ్‌ పేపర్‌ తెలిపింది. 2011లో 22.5ు ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి తగ్గినట్టు వివరిం చింది. ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం చెప్పుకోదగిన స్థాయిలో తగ్గిందని తెలి పింది. భారత్‌లో పేదరికానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఇటీవల ఒక వర్కింగ్‌ పేపర్‌ను విడుదల చేసింది. ఇందులో భార త్‌ తీవ్రమైన పేదరికాన్ని దాదాపు నిర్మూలించిందని, ఉచితంగా ఆహార ధాన్యా లను అందజేయడం ద్వారా వినియోగంలో అసమానతలను 40 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి తెచ్చినట్టు పేర్కొంది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు వర్కింగ్‌ పేపర్‌ కూడా భారత్‌లో పేదరికం తగ్గిందని చెబు తోంది. ఇక దేశంలో పట్టణాల కన్నా గ్రామాల్లో పేదరికంలో తగ్గుదల ఎక్కు వగా ఉందని వర్కింగ్‌ పేపర్‌ తెలిపింది. గ్రామాల్లో 2011లో 26.3ు ఉన్న పేదరికం 2019లో 11.6 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో పట్టణాల్లో పేదరికం 14.2ు నుంచి 6.3ుకు దిగివచ్చింది. ఈ లెక్కన 2011-2019 మధ్యకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం వరుసగా 14.7ు, 7.9ు మేర తగ్గిందని ప్రపంచబ్యాంకు వివరించింది. చిన్న కమతాలున్న రైతుల ఆదాయంలో ఎక్కువ వృద్ధి కనిపించిందని పేర్కొంది. 2013-2019 మధ్య కాలంలో వీరి వాస్తవ ఆదాయం ఏటా 10ు పెరిగిందని తెలిపింది. అదే ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న రైతుల ఆదాయం 2ు వృద్ధి చెందినట్టు పేర్కొంది. 

Updated Date - 2022-04-18T08:36:28+05:30 IST