Goodbye: రాజకీయాలకు ఎమ్మెల్యే గుడ్‌బై

ABN , First Publish Date - 2022-10-08T17:19:39+05:30 IST

అనారోగ్యం, కుటుంబ సమస్యల కారణంగా 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల నుంచి రిటైర్‌ అవతున్నానని తుమ

Goodbye: రాజకీయాలకు ఎమ్మెల్యే గుడ్‌బై

బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం, కుటుంబ సమస్యల కారణంగా 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల నుంచి రిటైర్‌ అవతున్నానని తుమకూరు జిల్లా మధుగిరి జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎంవీ వీరభద్రయ్య(MLA MV Veerabhadraiah) ప్రకటించారు. తాలూకాలోని సిద్దాపుర వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన నిర్ణయాన్ని అధినేతలు దేవెగౌడ, కుమారస్వామి(Deve Gowda, Kumaraswamy) దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. గతంలో పార్టీ విజయాల కోసం శక్తివంచన లేకుండా పాటుపడ్డానని, తనపై వచ్చిన విమర్శలను సైతం గరళకంఠుడిలా దిగమింగానని చెప్పుకొచ్చారు. తన బదులుగా మధుగిరిలో మరొకరికి టికెట్‌ ఇవ్వవచ్చునని, తాను ఎవరి పేరును సూచించనని వీరభద్రయ్య తెలిపారు. తాను అసంతృప్తితో ఈ ని ర్ణయం తీసుకోలేదని, ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణమని వివరించారు. 

Updated Date - 2022-10-08T17:19:39+05:30 IST