రాష్ట్రపతిని కలిసిన తర్వాత మోదీ ట్వీట్
ABN , First Publish Date - 2022-01-06T20:22:42+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. పంజాబ్లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మోదీ ట్విటర్ వేదికగా రామ్నాథ్ కోవింద్కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశాను. (భద్రతా లోపంపై) ఆందోళన వ్యక్తం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా శ్రేయస్సును ఆకాంక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇటువంటి ఆకాంక్షలే ఎల్లప్పుడూ బలాన్నిస్తాయి’’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.