నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త...వచ్చే ఏడాదిన్నరలోగా 10 లక్షలమంది recruitment
ABN , First Publish Date - 2022-06-14T15:55:59+05:30 IST
దేశంలోని నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శుభవార్త వెల్లడించారు....

న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శుభవార్త వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వశాఖల్లో 10లక్షలమందిని రిక్రూట్ మెంట్ చేయాలని ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత మోదీ దిశానిర్దేశం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ రంగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతిపక్షాలు తరచూ ధ్వజమెత్తాయి.
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని కేంద్రప్రభుత్వ శాఖలు,మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిని సమీక్షించారు రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల మందిని మిషన్ మోడ్లో ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలని ఆదేశించింది’’ అని పీఎంఓ ట్వీట్లో పేర్కొంది.