యెమెన్లో వైమానిక దాడి...60 మంది మృతి
ABN , First Publish Date - 2022-01-22T15:18:48+05:30 IST
యెమెన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో 60 మంది మరణించారు....
సాదా : యెమెన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో 60 మంది మరణించారు.ఉత్తర యెమెన్లోని సాదా నగర డిటెన్షన్ సెంటరుపై జరిగిన వైమానిక దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. వైమానిక దాడి వల్ల భవన శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. సాదా ప్రావిన్సులో జరిగిన వైమానిక దాడిలో ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. యెమెన్లో జరిగిన వైమానిక దాడుల్లో 60 మందికి పైగా పెద్దలు మరణించారని సేవ్ ది చిల్డ్రన్ పేర్కొంది. పశ్చిమ నగరమైన హొడైదాపై క్షిపణులు దాడి చేయడంతో ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ వైమానిక దాడిలో చాలామంది గాయపడ్డారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.