ఇరాన్‌ ఆందోళనల్లో మృతులు 300పైనే..

ABN , First Publish Date - 2022-11-30T02:46:40+05:30 IST

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య తొలిసారిగా అధికారికంగా తెలిసింది.

ఇరాన్‌ ఆందోళనల్లో మృతులు 300పైనే..

మొదటిసారిగా అధికారికంగా వెల్లడి

టెహ్రాన్‌, నవంబరు 29: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య తొలిసారిగా అధికారికంగా తెలిసింది. ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశ రక్షణశాఖ జనరల్‌ అమిర్‌ అలీ అజిజాదేహ్‌ ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మృతులకు సంబంధించిన స్పష్టమైన సంఖ్యను మాత్రం ఆయన వెల్లడించలేదు. మహ్సా అమిని అనే యువతి హిజాబ్‌ సరిగ్గా ధరించలేదని మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, సెప్టెంబరు 16న వారి కస్టడీలోనే ఆమె మృతిచెందడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-30T02:46:41+05:30 IST