ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించలేం
ABN , First Publish Date - 2022-07-05T07:54:42+05:30 IST
ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశా న్ని నిషేధించలేమని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిం ది.
మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ
చెన్నై, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశా న్ని నిషేధించలేమని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిం ది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు సంకుచిత దృష్టితో ఆలోచించలేవని, విశాల హృదయంతో ఆలోచించాలని పిటిషనర్కు సూచించింది. ప్ర ముఖ నేపథ్యగాయకుడు జె.ఏసుదాస్ హిందూయేతరుడైనా ఆయన ఎన్నో హిందువుల భక్తిగీతాలు ఆలపించారని, వేలాంకన్ని చర్చి, నాగూర్ దర్గాకు అనేకమంది హిందువులు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారని గుర్తు చేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ప్రజలు దైవభక్తితో ఆలయాలకు వెళ్తే.. వారి మతాన్ని ధ్రువీకరించడంలో సమస్యలు నెలకొంటాయని వ్యాఖ్యానించింది. అయితే, కుంభాభిషేకాల్లో హిందూయేతరులు ప్రవేశించరాదనే నిబంధన హిందూ దేవాదాయశాఖ నిబంధనల్లో లేదని స్పష్టం చేసింది. అందువల్ల హిందూ ఆలయాల్లోకి, కుంభాభిషేకాలకు హిందూయేతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిం.