Minister: కొత్త వైద్యకళాశాలలకు అనుమతివ్వండి
ABN , First Publish Date - 2022-09-07T13:47:57+05:30 IST
రాష్ట్రంలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వాలని, కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.
- ఆరోగ్యమంత్రి సుబ్రమణ్యం డిమాండ్
చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వాలని, కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంచుక్ మాండవ్యా, ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనావాల్ను కలుసుకుని ఓ వినతి పత్రం సమర్పించారు. నీట్ మినహాయింపు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని, మదురై(Madurai) తోప్పూరులో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రులను కోరారు.