ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2022-02-26T19:35:00+05:30 IST

ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో ఏడుగురు మరణించగా, మరో 85 మంది గాయపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ సుమత్రా దీవుల్లోని పసమాన్ బరత్, పసమాన్ జిల్లాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది.

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో ఏడుగురు మరణించగా, మరో 85 మంది గాయపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ సుమత్రా దీవుల్లోని పసమాన్ బరత్, పసమాన్ జిల్లాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు దాదాపు పదివేలకు పైగా ఇండ్లు, బిల్డింగులు ధ్వంసమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఐదు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 35 ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు. బాధితుల్ని ఆదుకునేందుకు ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, కనిపించకుండా పోయిన ప్రజల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-02-26T19:35:00+05:30 IST