GST: మదురైలో 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు
ABN , First Publish Date - 2022-08-02T14:31:39+05:30 IST
మదురైలో 48వ జీఎస్టీ(GST) కౌన్సిల్ సమావేశాలు ఈ నెల మూడు లేదా నాలుగవ వారంలో జరుగుతాయని ఆర్ధిక మంత్రి పీటీఆర్ పళనివేల్
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 1: మదురైలో 48వ జీఎస్టీ(GST) కౌన్సిల్ సమావేశాలు ఈ నెల మూడు లేదా నాలుగవ వారంలో జరుగుతాయని ఆర్ధిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్(Finance Minister PTR Palanivel Thyagarajan) తెలిపారు. ఉద్యోగావకాశాలు, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మదురైలో రూ.3.20 కోట్ల వ్యయంతో 100 మంది మహిళలు బసచేసేలా 25 గదులతో కూడిన ప్రభుత్వ మహిళా శిక్షణా కేంద్ర వసతిగృహాన్ని సీఎం స్టాలిన్(CM Stalin) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ప్రాంగణంలో వాణిజ్యపన్ను, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తి, ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్, కలెక్టర్ అనీ్షశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి పళనివేల్ త్యాగరాజన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పాలనలో అభివృద్ధికి నోచుకోని మదురై డీఎంకే పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని మంత్రి తెలిపారు.