కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో Karnataka మంత్రిపై కేసు
ABN , First Publish Date - 2022-04-13T16:24:37+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు...
ఉడిపి(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేసిన మంత్రి, అతని సహాయకుల వల్లనే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేర మంత్రి ఈశ్వరప్పతో సహా అతని ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసు పెట్టారు. తన సోదరుడిని మంత్రి బెదిరించడంతో పాటు అతనిపై పరువు నష్టం కేసు కూడా పెట్టారని, తన సోదరుడి మృతికి మంత్రి కారణమని ప్రశాంత్ ఆరోపించారు.సంతోష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఏప్రిల్ 11న బెల్గాం నుంచి బయలుదేరి అదృశ్యమయ్యాడు.మంగళవారం అతని మృతదేహం ఉడిపిలో శవమై కనిపించింది.