Quad 2022 : భారత్పై అమెరికా అధ్యక్షుడు Joe Biden ప్రశంసలు !
ABN , First Publish Date - 2022-05-25T02:32:58+05:30 IST
కొవిడ్-19(Covid) మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారత విజయవంతమయ్యిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు.
టోక్యో : కొవిడ్-19(Covid) మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారత్ (India) విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe biden) ప్రశంసించారు. ప్రజాస్వామ్య విధానంలో విపత్తుని అధిగమించడంలో భారత్ సఫలీకృతమయ్యిందన్నారు. అయితే భారత్కు విభిన్నంగా కరోనా కట్టడిలో డ్రాగన్ దేశం చైనా (China) విఫలమైందని విమర్శించారు. జనాభాపరంగా ఇరుదేశాలు దాదాపు సమానంగానే ఉన్నా చైనా వైఫల్యం చెందిందన్నారు. టోక్యోలో జరుగుతున్న క్వాడ్ 2022 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ- అధ్యక్షుడు బైడెన్ మధ్య జరిగిన ప్రత్యేక సెషన్లో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారని జాతీయ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని చెప్పినట్టు ప్రస్తావించాయి. అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా కలుగజేసుకుని ప్రధాని మోడీతో మాట్లాడినందున ఈ అంశం రికార్డ్ కాలేదని అధికారి వివరించారని పేర్కొన్నాయి.