భారత్లో కొత్తగా 4,194 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-03-11T16:31:11+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,194 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా... 255 మంది మృతి చెందారు. అలాగే కోవిడ్ నుంచి కోలుకుని 6,208 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 42,219 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,15,714గా ఉంది.