పశ్చిమబెంగాల్లో పట్టాలు తప్పిన గౌహతి-బికనేర్ ఎక్స్ప్రెస్.. ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2022-01-13T23:27:42+05:30 IST
కోల్కతా: పశ్చిమబెంగాల్లో రైలు ప్రమాదం జరిగింది. జల్పాయ్గురి సమీపంలోని దోమోహని వద్ద గౌహతి-బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ జల్పాయ్గురి సమీపంలోని దోమోహని వద్ద గౌహతి-బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు.