Former Chief Minister: కర్ణాటకలో మోదీ మ్యాజిక్ పని చేయదు..
ABN , First Publish Date - 2022-12-09T10:58:43+05:30 IST
గుజరాత్లో బీజేపీ భారీ విజయం సాధించినా కర్ణాటక ఎన్నికలకు దిక్సూచి కాదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి(
బెంగళూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గుజరాత్లో బీజేపీ భారీ విజయం సాధించినా కర్ణాటక ఎన్నికలకు దిక్సూచి కాదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి(Former Chief Minister and JDS leader Kumaraswamy) అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో మోదీ మ్యాజిక్ సాగదని తేల్చి చెప్పారు. గుజరాత్ ఫలితాల తర్వాత కలుబరిగిలో గురువారం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యమైనాయన్నారు. అక్కడ బీజేపీనే గెలుస్తుందని కాంగ్రెస్ వారు కూడా భావించారన్నారు. గుజరాత్ రాజకీయాలు వేరని కర్ణాటకతో సంబంధం లేదన్నారు. పైగా రెండు రాష్ట్రాల మధ్య సుదూరమన్నారు. గుజరాత్లో గెలుపు బీజేపీ సాధన కాదని ఇది రాష్ట్ర ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. రాష్ట్ర ప్రజలకు మోదీ మ్యాజిక్ గురించి తెలుసని ఎద్దేవా చేశారు. ఆప్కు బీజేపీ ఫండింగ్ చేసిందనే కాంగ్రెస్ అరోపణలపై మాట్లాడుతూ ఆప్ను బీటీం అంటూ వ్యాఖ్యానించేది లేదని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ నాయకులు కొందరు జేడీఎస్ను బీజేపీకి బీటీం అన్నారని ఆతర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అ న్నారు. కాంగ్రె్సకు నాయకత్వ లోపం ఉందని అంతే కానీ ఓటమికి ఆప్ కారణమనేది సరికాదన్నారు.