Former Chief Minister: ఉచిత చీర ధోవతి ఇవ్వకుంటే ఆందోళన
ABN , First Publish Date - 2022-12-30T08:26:31+05:30 IST
అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో బియ్యం రేషన్కార్డుదారులకు ఇచ్చినట్లు చీర, ధోవతి పొంగల్లోగా
- ఈపీఎస్ హెచ్చరిక
చెన్నై, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో బియ్యం రేషన్కార్డుదారులకు ఇచ్చినట్లు చీర, ధోవతి పొంగల్లోగా పంపిణీ చేయకుంటే ధర్నా, రాస్తారోకో చేస్తామని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎంకే ప్రభుత్వం చీరలు, ధోవతులను నాసిరకం నూలుతో తయారు చేయించినట్లు ఆరోపణలున్నాయన్నారు.