ESIC Online: ఇక ఆన్‌లైన్‌లో ఈఎ్‌సఐసీ మాతృత్వపు ప్రయోజనాలు

ABN , First Publish Date - 2022-11-12T03:45:48+05:30 IST

కేంద్ర బీమా కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) పథకంలో సభ్యులైన మహిళలు మాతృత్వపు ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పొందేలా కొత్త పోర్టల్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శుక్రవారం లాంచ్‌ చేశారు.

ESIC Online: ఇక ఆన్‌లైన్‌లో ఈఎ్‌సఐసీ మాతృత్వపు ప్రయోజనాలు

న్యూఢిల్లీ, నవంబరు 11: కేంద్ర బీమా కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) పథకంలో సభ్యులైన మహిళలు మాతృత్వపు ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పొందేలా కొత్త పోర్టల్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శుక్రవారం లాంచ్‌ చేశారు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. దత్తోపంత్‌ తెంగడి 102వ జయంతి సందర్భంగా ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో మంత్రి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా బీమాలో సభ్యులైన మహిళలకు సులువుగా ఎక్కడి నుంచైనా తమ ప్రయోజనాలను పొందే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా భూపేందర్‌ పేర్కొన్నారు. ఈఎ్‌సఐసీ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని గుర్తుచేశారు. కాగా.. 2021-22 సంవత్సరానికి గాను సుమారు 18.69 లక్షలమంది మహిళాలబ్ధిదారులకు రూ. 37.37 కోట్లమేర మాతృత్వ ప్రయోజనాలు లభించడం గమనార్హం.

Updated Date - 2022-11-12T03:45:49+05:30 IST