Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-12-20T07:18:46+05:30 IST

జమ్మూకశ్మీరులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం
Shopian Encounter

శ్రీనగర్: జమ్మూకశ్మీరులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎన్‌కౌంటర్ సాగుతోంది.(Encounter breaks out)షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎన్‌కౌంటరులో ముగ్గురు హతం అయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.(Shopian Encounter) పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడిగా గాలింపులో భాగంగా ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించారు.(Jammu and Kashmir)

షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు మంగళవారం ఉదయం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.మరణించిన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరుపుతూ గాలిస్తున్నారు. ‘‘షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు గాలింపు పనిలో ఉన్నాయి’’ అని కశ్మీర్ జోన్(Kashmir Zone Police) పోలీసులు ట్వీట్‌లో (tweet) తెలిపారు.

Updated Date - 2022-12-20T08:29:00+05:30 IST