అరుణాచల్ ప్రదేశ్లో 5.3 తీవ్రతతో భూకంపం
ABN , First Publish Date - 2022-04-15T14:20:33+05:30 IST
అరుణాచల్ ప్రదేశ్లో శుక్రవారం ఉదయం 6.56 గంటలకు భారీ భూకంపం సంభవించింది....
న్యూఢిల్లీ :అరుణాచల్ ప్రదేశ్లో శుక్రవారం ఉదయం 6.56 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది.అరుణాచల్ ప్రదేశ్లోని పాంగిన్కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ తన తాజా నివేదికలో పేర్కొంది. క్యాంప్ బెల్ బే, అండమాన్, నికోబార్ దీవుల్లోనూ భూకంపం సంభవించింది.30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అరుణాచల్ ప్రదేశ్ అధికారులు చెప్పారు.ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.