వికటించిన మాత్రలు.. విద్యార్థినులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-09-10T15:22:55+05:30 IST
సేలం జిల్లా(Salem District) ఆత్తూర్లోని ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ఈ
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 9: సేలం జిల్లా(Salem District) ఆత్తూర్లోని ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ఈ మాత్రలు వేసుకున్న 50 మంది విద్యార్థినులు హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. స్కూలు యాజమాన్యం వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆత్తూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.