అధీర్‌ రంజన్‌ ట్వీట్‌పై దుమారం!

ABN , First Publish Date - 2022-05-22T07:50:13+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ఆ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ట్వీట్‌పై దుమారం రేగింది.

అధీర్‌ రంజన్‌ ట్వీట్‌పై దుమారం!

న్యూఢిల్లీ, మే 21: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ఆ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ట్వీట్‌పై దుమారం రేగింది. రాజీవ్‌ వర్థంతి సందర్భంగా శనివారం ఆయన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ కనిపించింది. ‘వటవృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుంది’ అన్నది దాని సారాంశం. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన నేపథ్యంలో రాజీవ్‌గాంధీ చేసిన ప్రకటన అది. 3500 మంది మరణానికి కారణమైన ఆ అల్లర్లను సమర్థించేలా రాజీవ్‌ వ్యాఖ్య ఉందని అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది. శనివారం రాజీవ్‌ వర్ధంతి సందర్భంగా అదే ప్రకటన అధీర్‌ రంజన్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లో కనిపించింది. విమర్శలు చెలరేగడంతో ఆయన ఆ ట్వీట్‌ ను వెంటనే తొలగించారు. తన ఖాతా హ్యాక్‌ అయిందన్నారు. రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళి ఘటించారు.  

Updated Date - 2022-05-22T07:50:13+05:30 IST