యూపీ ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ
ABN , First Publish Date - 2022-01-13T21:10:52+05:30 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
మరోవైపు రెండు రోజుల క్రితమే మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి టాటా చెప్పి సమాజ్వాదీలో చేరారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కమలం పార్టీని వదిలి ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారు. పార్టీ వదిలిపెట్టి వెళ్తున్న నేతలను కమలనాథులు బుజ్జగించలేకపోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ వదిలిపెట్టి వెళ్తుండటంతో బీజేపీలో కలవరం మొదలైంది. గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని కలలుకంటోన్న యోగి ఆదిత్యనాథ్కు కొత్త తలనొప్పి మొదలైంది. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సాధారణమే అయినా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీని వీడుతుండటం కమలనాథులకు గుబులు రేపుతోంది.