Delhi HC orders: బీజేపీ సీనియర్ నేతపై అత్యాచారం కేసు...ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2022-08-18T15:11:25+05:30 IST
బీజేపీ సీనియర్ నాయకుడి(BJP leader) విషయంలో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం సంచలన ఆదేశాలు...

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడి(BJP leader) విషయంలో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్పై(BJP leader Shahnawaz Hussain) అత్యాచారం కేసు(police case) నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.(Delhi HC orders)2018వ సంవత్సరంలో తనపై షానవాజ్ హుస్సేన్ అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు మేర మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.(complete the investigation) మహిళ ఫిర్యాదు మేర బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అయిష్టంగా ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
షానవాజ్ హుస్సేన్ పై అత్యాచారం కేసు విషయంలో పోలీసుల వాదనను కింది కోర్టు తోసిపుచ్చిందని,బాధిత మహిళ ఫిర్యాదు మేర దర్యాప్తు చేయాలని హైకోర్టు కోరింది.2018వ సంవత్సరం జనవరి నెలలో ఢిల్లీకి చెందిన ఒక మహిళ (Delhi-based woman)హుస్సేన్పై అత్యాచారం కేసు దాఖలు చేయాలని దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని,తనను చంపేస్తానని బెదిరించాడని బాధిత మహిళ ఆరోపించింది.
