46 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-10T17:51:36+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. శనివారం 46 పాజిటివ్ కేసులు నమోదవగా బెంగళూరులో 39, ధారవాడలో 4, దావణగెరెలో 2, తుమకూరులో ఒక కేసు నమోదైంది. 26 జిల్లా

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. శనివారం 46 పాజిటివ్ కేసులు నమోదవగా బెంగళూరులో 39, ధారవాడలో 4, దావణగెరెలో 2, తుమకూరులో ఒక కేసు నమోదైంది. 26 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. కాగా 75 మంది కోలుకున్నారు. మృతులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో 1430 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 1349 మంది ఉన్నారు. 14 జిల్లాల్లో యాక్టివ్ కేసులు లేవు.