కార్పొరేషన్లో ప్రధాని Photo
ABN , First Publish Date - 2022-05-26T15:25:37+05:30 IST
శివకాశి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టడాన్ని డీఎంకే కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం బుధవారం
- డీఎంకే కార్పొరేటర్ల అభ్యంతరం
పెరంబూర్(చెన్నై): శివకాశి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టడాన్ని డీఎంకే కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మేయర్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభమైన అనంతరం బీజేపీ కార్పొరేటర్ కుమరి భాస్కరన్ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను కమిషనర్కు అందజేసి హాలులో పెట్టాలని కోరారు. దీనిపై డీఎంకే కార్పొరేటర్లు నిరసన తెలపడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీతో గొడవ సద్దుమణిగి సమావేశం సజావుగా సాగింది.