కార్పొరేషన్ ఉద్యోగులకు Covid
ABN , First Publish Date - 2022-01-14T16:22:37+05:30 IST
ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆవడి కార్పొరేషన్లో పనిచేసే ఒక ఇంజనీర్, వైద్యుడు సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకింది. అలాగే మరికొంత మంది సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడ్డారు. చెన్నై
అడయార్(చెన్నై): ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆవడి కార్పొరేషన్లో పనిచేసే ఒక ఇంజనీర్, వైద్యుడు సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకింది. అలాగే మరికొంత మంది సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడ్డారు. చెన్నై జిల్లాతో పాటు తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ఆవడి కార్పొరేషన్లో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఆవడి కార్పొరేషన్ ఉద్యోగులకు చేసిన పరీక్షల్లో ఒక ఇంజనీర్, ఏఈ, హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఆఫీస్ సిబ్బందితో కలిపి మొత్తం ఏడుగురికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వెంటనే వీరితో కాంటాక్ట్ అయిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు హెల్త్ వర్కర్లు ప్రయత్నిస్తున్నారు.