‘యూపీ మండలి’లో కాంగ్రెస్‌ గల్లంతు

ABN , First Publish Date - 2022-07-07T08:34:25+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో 110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్‌ తరపున శాసనమండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి కనిపించనుంది.

‘యూపీ మండలి’లో కాంగ్రెస్‌ గల్లంతు

110 ఏళ్లలో తొలిసారి..

లఖ్‌నవూ, జూలై 6: ఉత్తర ప్రదేశ్‌లో 110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్‌ తరపున శాసనమండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి కనిపించనుంది. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఉన్న ఏకైక ప్రతినిధి దీపక్‌ సింగ్‌తో పాటు వేర్వేరు పార్టీలకు చెందిన 12మంది మండలి సభ్యుల పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో గురువారం నుంచి మండలిలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 403 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు మాత్రమే గెలుచుకోవడంతో ఆ పార్టీ తమ తరపున ఎమ్మెల్సీలను మండలికి పంపే పరిస్థితి లేదు. కాగా.. ఈ పరిస్థితిని కాంగ్రెస్‌ నేత ఆరాధన మిశ్రా బాధాకరమైనదిగా వర్ణించారు. 


Updated Date - 2022-07-07T08:34:25+05:30 IST